- Advertisement -
- రికార్డుల తనిఖీ
- మధ్యాహ్నం వివరాలు వెల్లడిస్తాం: ఏసీబీ డీఎస్పీ
నవతెలంగాణ -మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏసీబీ తనిఖీలు కలకలం రేపింది. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో శుక్రవారం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఏసీబీ అధికారుల బృందం తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఎందుకు తనిఖీలు చేస్తున్నారన్న విషయం పై అధికారులు వివరాలు వెల్లడించలేదు. కానీ ఆసుపత్రిలో రికార్డులు తనిఖీ చేస్తున్నామని, వివరాలు మధ్యాహ్నం వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



