- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరగనున్నాయి. అర గంట ముందుగానే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షలు ఏప్రిల్ 16 వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 2676 కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన పరీక్షా కేంద్రాలలోనికి అనుమతిస్తామని అధికారులు చెప్పారు.
- Advertisement -



