- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలో వరంగల్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ తాడిపత్రి రాకేశ్ (40) మృతిచెందారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం గుండెపోటుతో ఆయన మృతిచెందినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. రాకేశ్ ఉద్యోగ రీత్యా గత పదేళ్లుగా అమెరికాలో స్థిరపడ్డారు. 2014లో కరీంనగర్కు చెందిన తేజస్వినితో ఆయనకు వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలున్నారు. ఈ కుటుంబం ప్రస్తుతం వర్జీనియా రాష్ట్రంలో నివాసముంటోంది. రాకేశ్ తండ్రి జితేందర్ వరంగల్లో వ్యాపారవేత్త.
- Advertisement -



