- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: వంట నూనె ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇటీవల ఆన్లైన్ మార్కెట్లో సన్ఫ్లవర్ నూనె ధర లీటర్కు రూ.152 ఉండగా ప్రస్తుతం రూ.174–178కు పెరిగింది. ఆఫ్లైన్ మార్కెట్లో కూడా రూ.165–168 మధ్య విక్రయిస్తున్నారు. పల్లీ నూనె ధరలు లీటర్కు రూ.220 దాటాయి. డిమాండ్ పెరగడంతో సరఫరా తగ్గి పలు సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాల్లో ‘నో స్టాక్’ బోర్డులు పెడుతున్నారు. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం ఇంకా కొనసాగితే దిగుమతులు తగ్గి, నూనె ధరలు ఇంకా పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు.
- Advertisement -



