- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ను వీడడంపై సంజు శాంసన్ తొలిసారి నోరు విప్పాడు. జట్టులో తన సమయం ముగిసిపోయిందని భావించడంతోనే వైదొలిగినట్లు చెప్పాడు. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్లో రాజస్థాన్తో జరిగే పోరులో తన ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు. తొలిసారి రాజస్థాన్కు ప్రత్యర్థి ఆటగాడిగా బరిలోకి దిగబోతున్నట్లు చెప్పాడు. గత ఐపీఎల్ ముగిసిన అనంతరం శాంసన్ ఆర్ఆర్ను వీడి చెన్నై జట్టులో చేరిన విషయం తెలిసిందే.
- Advertisement -



