- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : పెరూలో రాజకీయ సంక్షోభం తీవ్రమవుతోంది. బుధవారం జరగాల్సిన పార్లమెంటరీ విశ్వాస పరీక్షకు ముందు, ప్రధానమంత్రి డెనిస్ మిరాలెస్ మంగళవారం రాజీనామా చేశారు. మెజారిటీ సభ్యుల మద్దతుపై అనిశ్చితి నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అవినీతి ఆరోపణలు, ఆర్థిక క్రమశిక్షణపై విమర్శలు ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. ఏప్రిల్ 12న అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
- Advertisement -



