- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : లష్కర్-ఎ-తోయిబా ప్రధాన కార్యాలయం ‘మార్కజ్ తాయిబా’లో శనివారం సీనియర్ కమాండర్ బిలాల్ అరిఫ్ సలాఫీ అత్యంత దారుణ హత్యకు గురయ్యాడు. ఈద్ ప్రార్థనల అనంతరం బయటకు వస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు అతన్ని సమీపం నుండి తుపాకీతో కాల్చి, కత్తులతో నరికి చంపారు. 2005 నుండి సంస్థలో కీలక పాత్ర పోషిస్తూ, నిధుల సమీకరణ, రిక్రూట్మెంట్లలో ఆరితేరిన సలాఫీని ఆసుపత్రిలో చేర్పించినా, చికిత్స పొందుతూ మరణించినట్లు నివేదికలు తెలిపాయి.
- Advertisement -



