- Advertisement -
కారోబార్ నియామకానికి సభ తీర్మానం
నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ మండలంలోని అంతాపూర్ గ్రామంలో సోమవారం నాడు ఆ గ్రామ సర్పంచ్ పార్వతీ బాయి అధ్యక్షతన గ్రామసభ జరిగింది. ఈ గ్రామ సభలో ముఖ్యంగా పంచాయతీ కారోబార్ నియామకంపై తీర్మానం చేసినట్టు గ్రామ కార్యదర్శి తెలిపారు. అదేవిధంగా గ్రామ సమస్యల పరిష్కారానికి గ్రామస్తులు సభా దృష్టికి తీసుకువచ్చినట్టు కార్యదర్శి తెలియజేశారు. ఈ గ్రామ సభలో ఉప సర్పంచ్ సంగీత, వార్డ్ సభ్యులు, అంగన్వాడి, ఆశా వర్కర్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



