Wednesday, March 25, 2026
E-PAPER
Homeజాతీయంపార్టీ ఆఫీసు ఖాళీ చేయాలి..కాంగ్రెస్‌కు కేంద్రం నోటీసులు జారీ

పార్టీ ఆఫీసు ఖాళీ చేయాలి..కాంగ్రెస్‌కు కేంద్రం నోటీసులు జారీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్, 5 రైసినా రోడ్‌లలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను ఖాళీ చేయాలని కేంద్ర నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. మార్చి 28వ తేదీలోగా ఈ భవనాలను అప్పగించాలని స్పష్టం చేసింది. 48 ఏళ్లుగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయం 24 అక్బర్ రోడ్‌లో కొనసాగుతోంది. నిబంధనల ప్రకారం, సొంత స్థలాల్లో కార్యాలయాలు నిర్మించుకున్న తర్వాత ప్రభుత్వ భవనాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -