Thursday, March 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డబుల్ బెడ్ రూమ్ పెండింగ్ పనులను  త్వరగా పోస్ట్ చేయాలి

డబుల్ బెడ్ రూమ్ పెండింగ్ పనులను  త్వరగా పోస్ట్ చేయాలి

- Advertisement -

– జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : జిల్లాలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఉన్న మౌళిక వసతుల పెండింగ్  పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.

గురువారం మినీ మీటింగ్ హల్ లో భువనగిరి మండలంలోని సింగన్నగూడెం, బీబీనగర్, వంగపల్లి, నారాయణపూర్, పోచంపల్లి, జిబిలకపల్లి లోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మౌళిక వసతులపై  జిల్లా కలెక్టర్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, హౌసింగ్ అధికారులతో కలసి సమీక్షించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లడుతూ డబుల్ బెడ్, ఇందిరమ్మ  ఇండ్ల పురోగతి పై సంబంధిత అధికారులను  అడిగి తెలుసుకున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద ఇంకా ఏఏ పనులు పెండింగ్ లో ఉన్నాయని , ప్రస్తుతం జరుగుతున్న  పనులను కూడా త్వరగా పూర్తి   చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు . అన్ని పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని,ప్రతి ఇంటికి  సంబంధించిన పనులను త్వరగా పూర్తిచేసి ఉపయోగం లోకి తేవాలన్నారు. ఈ కార్యక్రమం లో హోసింగ్ పి  డి శ్రీ రాములు, ఆర్ అండ్ బి అధికారి సరిత, పి ఆర్. ఈ ఈ    దాసయ్య సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -