- Advertisement -
నవతెలంగాణ-మల్హర్రావు: మండలంలో రేపు శుక్రవారం జరుగనున్న శ్రీరామనవమికి ఆలయాలు ముస్తాబైయ్యాయి. తాడిచెర్లలోని వేంకటేశ్వర స్వామి ఆలయం,పెద్దతూoడ్లలోని శ్రీహనుమాత్సహిత రాజరాజేశ్వరి ఆలయం,గాదంపల్లిలోని హనుమాన్ సైత శివ పంచాయతన ఆలయం, మానేరు ఒడ్డున ఉన్న పురాతనమైన రామలింగేశ్వర ఆలయాల్లో శ్రీరామనవమి వేడుకలకు ఆలయాలను ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ముస్తాబు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీలు చలువపందిర్లు,తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు ఆలయాల వద్ద రంగులను వేసి సుందరంగా తీర్దిదిద్దారు.
- Advertisement -



