- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఇండియా క్రికెట్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యక్తిత్వ హక్కులను పరిరక్షిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఫొటో, వాయిస్తో రూపొందించిన ఏఐ వీడియోలు, డీప్ ఫేక్ కంటెంట్ను 36 గంటల్లోగా తొలగించాలని ఇన్స్టాగ్రామ్, గూగుల్ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను ఆదేశించింది. ఈ కంటెంట్ను సృష్టించిన వారి వివరాలు అందించాలని పేర్కొంది. అనుమతి లేకుండా వీడియోలు చేయడం వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.
- Advertisement -



