- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : విశాఖపట్నంలో గ్యాస్ సిలిండర్ల డెలివరీ బాయ్ అప్పారావు 30 సిలిండర్లతో పరారయ్యాడు. చిన్నగంట్యాడ ఏజెన్సీలో పనిచేస్తున్న అప్పారావు, కస్టమర్ల నుండి ముందే OTP తీసుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై గ్యాస్ ఏజెన్సీ గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అప్పారావు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
- Advertisement -



