- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్ లో కోల్ కతా జట్టు కెప్టెన్ రహానే, ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఓటమి తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆస్ట్రేలియా ఆటగాడు గ్రీన్ తో బౌలింగ్ ఎందుకు చేయించలేదని అడిగిన ప్రశ్నకు, రహానే ‘మీరు అతడి క్రికెట్ బోర్డును అడగాలి’ అని సమాధానం ఇచ్చారు. దీనిపై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు స్పందిస్తూ, గాయం కారణంగానే గ్రీన్ తో బౌలింగ్ చేయించలేదని, వైద్యుల సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. రహానే వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
- Advertisement -



