నవతెలంగాణ-హైదరాబాద్: కేరళం కొట్టాయం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. యూఎస్-ఇండియా ట్రేడ్ డిల్తో భారతీయ రైతులకు ప్రయోజనం ఏమి లేదని, ఆ ఒప్పందంతో రైతుల భవిష్యత్తో అంధకామమేనని ఆరోపించారు. యూఎస్కు చెందిన వస్తువులకు మోడీ గేట్లు బారల తీశాయరని మండిపడ్డారు.
‘‘ఆధునిక భారత చరిత్రలో వ్యవసాయ రంగాన్ని అంతర్జాతీయ మార్కెట్కు తెరిచిన తొలి ప్రధాని ఆయనే. మన ఇంధన భద్రతను వదులుకున్న ఆధునిక భారత తొలి ప్రధాని కూడా ఆయనే. ఈ రోజు భారతదేశం తనకు కావలసిన వారి నుంచి చమురు, డీజిల్, పెట్రోల్ కొనలేకపోతోంది,” అని ఆయన అన్నారు. “మధ్యప్రాచ్యంలో జరిగిన పరిణామాల వల్ల ఒక ఆర్థిక భూకంపం రాబోతోంది, కానీ 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం తనకు కావలసిన వారి నుంచి చమురు కొనలేకపోతోంది. ఒకవేళ భారతదేశం రష్యా, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా నుంచి చమురు కొనాలనుకుంటే, డొనాల్డ్ ట్రంప్ అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే అలా చేయగలదు. ఇంతకంటే సిగ్గుచేటైన విషయం మరొకటి ఉండదు. ఒక స్వతంత్ర దేశం చమురు కొనడానికి అమెరికా అనుమతి అడగాల్సి వస్తోంది’’ అని రాహుల్ గాంధీ మండిపడ్డారు



