- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధాని మోడీ ఈ సాయంత్రం కీలక భద్రతా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి సీనియర్ మంత్రులంతా హాజరుకానున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిణామాలపై చర్చించనున్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్ సమయంలో ఎదుర్కొన్నట్లుగానే.. తాజా సంక్షోభాన్ని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. గ్యాస్ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, చమురు, గ్యాస్ గురించి పుకార్లు వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
- Advertisement -



