- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇరాన్తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే బహ్రెయిన్లోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ కంప్యూటింగ్ డేటా సెంటర్పై ఇరాన్ విప్లవాత్మక గస్తీ దళం (IRGC) బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో డేటా సెంటర్లోని సర్వర్లు తీవ్రంగా దెబ్బతినడంతో గల్ఫ్ ప్రాంత వ్యాప్తంగా క్లౌడ్ సేవలకు భారీ అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ యొక్క నిఘా, సైనిక కార్యకలాపాలకు ఈ డేటా సెంటర్లు సహకరిస్తున్నాయనే నెపంతో ఇరాన్ ఈ దాడులకు పాల్పడినట్టు సమాచారం.
- Advertisement -



