- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా చేతులు ఎత్తే క్రమంలో కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అధికారులతో ఎమ్మెల్యే బొజ్జు, కాంగ్రెస్ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే సమావేశం నుంచి ఎమ్మెల్యే బయటకు వెళ్లిపోయారు.
- Advertisement -



