నవతెలంగాణ-హైదరాబాద్ : నగరంలో శనివారం అర్ధరాత్రి ఓ డీసీఎం వాహనం బీభత్సం సృష్టించింది. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి 5 కి.మీ.ల దూరం అలాగే ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ఒక మహిళ మరణించారు. మాదాపూర్ పరిధిలో మైండ్స్పేస్ సమీపంలో డీసీఎం వేగంగా వెళ్తూ ఇద్దరు మహిళలు ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టింది. ద్విచక్రవాహనం డీసీఎం కింద ఇరుక్కుపోయినా డీసీఎం డ్రైవరు ఆగకుండా జూబ్లీహిల్స్ వరకూ నడిపాడు. గమనించిన కొందరు యువకులు డీసీఎంను వెంటాడి అడ్డుకున్నారు. డ్రైవరు పారిపోగా.. సహాయకుడు దొరికాడు. కోపోద్రిక్తులైన స్థానికులు సహాయకుడిని చితకబాదారు. పోలీసులు సహాయకుడిని అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళలను ఏఐజీ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ఒకరు మృతిచెందినట్లు తెలిపారు.
స్కూటీని 5కి.మీ. ఈడ్చుకెళ్లిన డ్రైవర్..మహిళ మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



