నవతెలంగాణ – హైదరాబాద్: ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ స్టేషన్లపై బస్సుల రాకపోకల ఒత్తిడి తీవ్ర నెలకొంది. ఈ పరిస్థితిని తప్పించేందుకు టీజీఎస్ఆర్టీసీ 100 ఎకరాల్లో అత్యాధునిక బస్ టెర్మినల్ను అందుబాటులోకి తీసుకురానుంది. జీడిమెట్ల గాజుల రామారంలో అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు ప్రత్యేక బస్ టెర్మినల్తోపాటు సిటీ బస్సులకు మరో టెర్మినల్.. ఎలక్ర్టిక్ బస్సుల కోసం ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి నిత్యం హైదరాబాద్కు వచ్చే బస్సులతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఈ సరికొత్త బస్ టెర్మినల్ నిర్మించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గాజులరామారంలో 100 ఎకరాల భూమిని టీజీఎస్ఆర్టీసీ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఇటీవలె కేటాయించారు. ఈ వంద ఎకరాల్లో సుమారు 30 ఎకరాలను అంతరాష్ట్ర బస్సుల కోసం ఒక ప్రత్యేక టెర్మినల్ను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ భావిస్తోంది. సిటీ బస్సులను కూడా ఈ బస్ టెర్మినల్ నుంచే అన్ని ప్రాంతాలకు నడిపించేందుకు సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో సిటీ బస్ టెర్మినల్ను నిర్మించనున్నారు. ఈ బస్ టెర్మినల్లో అత్యాధునిక సౌకర్యాలు, దుకాణాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఎలక్ర్టిక్ బస్సుల కోసం 10 ఎకరాల విస్తీర్ణంలో డిపో.. ఈవీ బస్సుల కోసం 15 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేకంగా ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఎంజీబీఎస్ తరహాలో మరో భారీ ఆర్టీసీ బస్ టెర్మినల్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



