- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా సైన్యం కదలికలను చైనా ప్రయివేటు సంస్థలు ట్రాక్ చేస్తున్నట్లు ఓ నివేదిక పేర్కొంది. ఇందుకోసం చైనా టెక్ కంపెనీలు ఏఐ టెక్నాలజీ, ఓపెన్ సోర్స్ డేటాను వాడుతున్నాయట. దీంతో యుద్ధరంగ నిఘాకు సంబంధించి వాషింగ్టన్ ఆందోళనలో ఉన్నట్లు ఆ కథనం పేర్కొంది. అమెరికా దళాల మోహరింపును బహిర్గతం చేసేలా ఆ దేశ ప్రయివేటు సంస్థలు నిఘా టూల్స్ను మార్కెటింగ్ చేస్తున్నట్లు తెలిపింది.
- Advertisement -



