- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తెరదించేందుకు అమెరికా, ఇరాన్ల మధ్య చర్చలకు పాకిస్థాన్, తుర్కియే, ఈజిప్టు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. ఈ క్రమంలో 45 రోజుల కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు సంబంధించిన ముసాయిదా ప్రతిపాదనలను ఇరాన్, అమెరికాలకు ఆ దేశాలు అందజేసినట్లు సమాచారం. 45 రోజుల సమయంలో శాశ్వత కాల్పుల విరమణ దిశగా చర్చలు జరిపేందుకు అవకాశం లభిస్తుందని భావిస్తున్నాయి. ఈ ప్రతిపాదనలపై అమెరికా, ఇరాన్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
- Advertisement -



