- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: రాజ్యసభలో పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి ఎన్నికైన ఎంపీలు రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్సీపీ-ఎస్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, కేంద్రమంత్రి రాందాస్ అథేవాల్, డీఎంకే నేత తిరుచ్చి శివ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఆయా పార్టీలకు చెందిన ప్రముఖ నేతలంతా హాజరయ్యారు. గత నెల ఆయా రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. దీంతో పలువురు రాజ్యసభ ఎంపీలుగా ఎన్నికయ్యారు. బీహార్లో అనూహ్యంగా నితీష్ కుమార్ రాజ్యసభకు పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు.
- Advertisement -



