Monday, April 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే సహించేది లేదు 

అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే సహించేది లేదు 

- Advertisement -

– ఎస్సై చిర్ర రమేష్ బాబు 
నవతెలంగాణ-నెల్లికుదురు : ప్రభుత్వ అనుమతులు లేకుండా ఆక్రమంగా ఆఖరి వాగు నుండి ఇసుక రవాణా చేసినట్లయితే ఎంతటి వారినైనా సహించేది లేదని నెల్లికుదురు చేస్తే సి హెచ్ రమేష్ బాబు తెలిపారు. సోమవారం తహసిల్దార్ చందా నరేష్ ఎదుట బైండోవర్ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

అక్రమంగా ఇసుక తరలిస్తున్న పదిమంది ట్రాక్టర్ డ్రైవరు కం ఓనర్ లను  స్థానిక నెల్లికుదూర్ తహశీల్దార్  ముందు బైండోవర్  చేయనైనది అని తెలిపారు. సోమవారం ఉదయం బ్రాహ్మణ కొత్తపల్లి వాగులో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందని నమ్మదగిన సమాచారం మేరకు నెల్లికుదూర్ ఎస్సై సిహెచ్. రమేష్ బాబు ,  తన సిబ్బందితో బ్రాహ్మణ కొత్తపల్లి  వాగు వద్దకు వెళ్ళగా అక్కడ ఖాళీ పది ట్రాక్టర్లు ఉండగా, అట్టి ట్రాక్టర్ డ్రైవరు కం  ఓనర్ లను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి ఇకముందు ప్రభుత్వ అదికారుల అనుమతి లేకుండా ఇసుక రవాణా చేయమని వాగులోనికి  దిగకుండా, ఒకవేళ వాగులోనికి దిగి పట్టుబడితే రెండు లక్షల రూపాయల జరిమానా కట్టేటట్లు స్థానిక  తహశీల్దార్- నెల్లికుదూర్  ముందు  బైండోవర్  చేసి, అట్టి ఖాళీ ట్రాక్టర్ ల యొక్క డాక్యుమెంట్స్ పరిశీలించి, తగిన ఈ- చలన్ ఫైన్  వేయనైనది.   ఎవ్వరైన ప్రభుత్వ అదికారుల అనుమతి లేకుండా ఇసుక తొలితే వారిపై చట్టప్రకారం చర్య తీసుకోబడతాయి ఆదేవిదంగా వారి ట్రాక్టర్ లు సీజ్ చేయబడతాయి అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -