Monday, April 6, 2026
E-PAPER
Homeజిల్లాలుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి: సిపిఐ డిమాండ్

పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి: సిపిఐ డిమాండ్

- Advertisement -

నవతెలంగాణ–ఆలేరు రూరల్ః ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) డిమాండ్ చేసింది. సోమవారం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్ గుడిసెల్లో నివసిస్తున్న లబ్ధిదారులను ప్రత్యక్షంగా సందర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన నిలబడి, భూమిలేని నిరుపేదలకు వెంటనే ఇంటి స్థలాల పట్టాలు ఇవ్వాలని కోరారు.ఎన్నో సంవత్సరాలుగా గుడిసెల్లోనే జీవనం సాగిస్తున్న పేదల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పోతు ప్రవీణ్, మోతే భవాని, సంపత్, యాట ఉపేందర్, క్రాంతి, సుశీల, సరిత, లక్ష్మి, పొన్నబోయిన రవి, సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -