- Advertisement -
నవతెలంగాణ–మల్హర్ రావు
ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గురుకులం ఫలితాల్లో మండల కేంద్రమైన తాడిచెర్లలోని ఎస్సికాలని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న ఇందారపు అన్విత, ఇందారపు రియాన్సి, ఇందారపు కళ్యాణ్ విద్యార్థులు ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గురుకుల పరీక్షల్లో సీటు సాధించి తమ సత్తాను ఛాటినట్లుగా పాఠశాల ప్రాధానోపాధ్యాయురాలు గీత, ఉపాధ్యాయులు అరుణ్ కుమార్, సురేష్ తెలిపి విద్యార్థులను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యకి గురుకుల సీట్లు నిదర్శనమని, కావున తల్లిదండ్రులు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యతో తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు సహకరించాలని కోరారు.
- Advertisement -



