– ప్రజా పోరాటాల బలోపేతానికి పిలుపు
– సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు పశ్య పద్మ
నవతెలంగాణ – కామారెడ్డి : ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)కు ప్రజలు ఆదరణతో పాటు ఆర్థిక సహకారం అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు పశ్య పద్మ పిలుపునిచ్చారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ప్రజా పోరాటాలను మరింత బలోపేతం చేయడానికి అన్ని వర్గాల ప్రజలు సిపిఐకు చేయూతనివ్వాలని కోరారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. రైతులు, నిరుపేదలు, చిన్న వ్యాపారులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాలను కోరారు. కమ్యూనిస్టు పార్టీ బలోపేతానికి రాష్ట్రవ్యాప్తంగా “ఇంటింటికి సిపిఐ” కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా కామారెడ్డి పట్టణంలో కిరాణా, బట్టల దుకాణాలు, ఇతర వ్యాపారస్తులను కలిసి సామూహిక విరాళాల సేకరణ నిర్వహించినట్లు చెప్పారు. వ్యాపారస్తులు సానుకూలంగా స్పందించి సహకరించినందుకు వారికి విప్లవ వందనాలు తెలిపారు.
“ఇంటింటికి సిపిఐ – సామూహిక విరాళాల సేకరణ – ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి” అనే నినాదంతో కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎల్. దశరథ్, జిల్లా సహాయ కార్యదర్శి పి. బాలరాజ్, జిల్లా నాయకులు ఎం. దేవయ్య, ఎం. రాజమణి, జి. మల్లేష్, ఎం. ప్రవీణ్, అశోక్, ఏఐఎస్ఎఫ్ నాయకులు సంపత్, శివప్రసాద్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.
సిపిఐకు ఆర్థిక సహకారం అందించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



