- Advertisement -
నవతెలంగాణ-ఊరుకొండ: ఊరుకొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రేవల్లి గ్రామ ఉపసర్పంచ్ అయ్యూబ్ పాషాను నియమించినట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో మొదటినుండి ఏలాంటి ప్రలోభాలకు లొంగకుండా పార్టీ కోసం పనిచేస్తున్న అయ్యూబ్ పాషాను మండల అధ్యక్షులుగా నియమించడం అభినందనీయమని పలువురు కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అధ్యక్ష పదవిలో సహకరించిన పార్టీ పెద్దలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



