- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, రైతు సంఘం అఖిల భారత నాయకులు సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన సోమవారం తెల్లవారుజామున 3గంటలకు తుది శ్వాస విడిచారు. రేపు ఉదయం ఎంబీ భవన్కు ఆయన భౌతికకాయాన్ని తరలించనున్నారు. అక్కడ అభిమానుల సందర్శనార్ధం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఆయన పార్థివదేహాన్ని ఉంచనున్నారు. ఆయన స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేట.
- Advertisement -



