నవతెలంగాణ – హైదరాబాద్: ఇరాన్పై తలపెట్టిన సైనిక దాడులను రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లపై తక్షణ ప్రభావం పడింది. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ భయాలు తాత్కాలికంగా తొలగిపోవడంతో ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి. స్టాక్ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. గత కొన్ని వారాలుగా హర్మూజ్ జలసంధి వద్ద నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా పెరుగుతూ.. వచ్చిన ముడి చమురు ధరలు, ట్రంప్ ప్రకటనతో 100 డాలర్ల కంటే దిగువకు పడిపోయాయి. హర్మూజ్ జలసంధిని ఇరాన్ తిరిగి తెరవాలనే షరతుపై దాడులను నిలిపివేస్తున్నట్లు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ట్రూత్ సోషల్’ లో వెల్లడించారు. అమెరికా ప్రధాన సూచీల ఫ్యూచర్స్ 2 శాతానికి పైగా పెరిగాయి. ప్రపంచంలోని ఐదో వంతు చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో ఇరాన్ ఆంక్షలు విధించడంతో సరఫరాపై ఆందోళనలు పెరిగి ధరలు పెరిగాయి. తాజా పరిణామాలతో అమెరికా మార్కెట్లతో పాటు జపాన్ నిక్కీ, దక్షిణ కొరియా కోస్పి సూచీలు పుంజుకున్నాయి.
భారీగా తగ్గిన చమురు ధరలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



