- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
గురుకులం ఫలితాల్లో మండల కేంద్రమైన తాడిచెర్లలోని ఎస్సికాలని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న ఇందారపు అన్విత, ఇందారపు రియాన్సి, ఇందారపు కళ్యాణ్ లు సీటు సాధించి తమ సత్తా చాటారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాధానోపాధ్యాయురాలు గిత, ఉపాధ్యాయులు అరుణ్ కుమార్, సురేష్ విద్యార్థులను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యకి గురుకుల సీట్లు నిదర్శనమని, కావున తల్లిదండ్రులు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యతో తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు సహకరించాలని కోరారు.
- Advertisement -



