నవతెలంగాణ – ఊరుకొండ
ఊరుకొండ మండలపరిధిలోని నర్సంపల్లి గ్రామంలో పశువులకు సోకే గాలికుంటు వ్యాధిని నివారించేందుకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక వాక్సినేషన్ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సంపల్లి గ్రామ సర్పంచ్ పులిమామిడి శైలజశ్రీశైలం,వైద్యాధికారి పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో రైతులు తమ పశువులను తీసుకొచ్చి వ్యాక్సినేషన్ టీకాలు వేయించుకున్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శైలజ శ్రీశైలం, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, వార్డు మెంబర్స్ చెదురుపల్లి విజయ్ కుమార్, లక్ష్మి, గ్రామ సీనియర్ నాయకులు వీరెడ్డి వెంకట్ రెడ్డి, రామ్ రెడ్డి, శేఖర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి , శ్రీను, కృష్ణయ్య, చిన్న, యాదయ్య, కమల, పశువైద్య సిబ్బంది గ్రామస్తులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
నర్సంపల్లిలో పశువులకు టీకాల పంపిణీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



