- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కేరళం, అస్సాం, పుదుచ్చేరిల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం కాగా.. కేరళంలో అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆర్సి అమల యూపీ పాఠశాలలో కుటుంబంతో కలిసి వచ్చి సీఎం పినరయి విజయన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయనతో పాటు ఇతర మంత్రులు, నటులు మోహన్లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, నటుడు, కేంద్ర మంత్రి సురేశ్ గోపి వంటివారు వారి ఓటు వేశారు.
- Advertisement -



