- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కొత్త పార్టీపై కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. తాను స్థాపించబోయే కొత్త పార్టీని ఏప్రిల్ 25న ప్రకటిస్తానని వెల్లడించారు. ఆ రోజు నిర్వహించనున్న సభ కోసం ఇప్పటికే 21 కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి కమిటీలో 30 మంది సభ్యులు ఉంటారని, కార్యక్రమం సజావుగా జరిగేలా బాధ్యతలు నిర్వహిస్తారని చెప్పారు. ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు లేకుండా ఉండేందుకు 500 మంది వాలంటీర్లను నియమించినట్లు కవిత తెలిపారు. సభకు భారీగా జనసమీకరణ ఉండనున్నట్లు సంకేతాలు ఇచ్చారు.
- Advertisement -



