Friday, April 10, 2026
E-PAPER
HomeజాతీయంBengal SIR :ఈసీపై పిటిషన్ల విచారణకు సుప్రీం ఓకె

Bengal SIR :ఈసీపై పిటిషన్ల విచారణకు సుప్రీం ఓకె

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, ఓటర్ల జాబితాను స్తంభింపచేయాలన్న ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌లను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది. వాటితో పాటు మరో కొత్త పిటిషన్‌పై ఏప్రిల్‌ 13న విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోమాల్య బాగ్చి, జస్టిస్‌ విపుల్‌ ఎం. పంచోలిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. మొదటి దశలో పోలింగ్‌ జరగనున్న అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఓటర్ల జాబితాలను ఈసీ ఏప్రిల్‌ 9న స్తంభింపచేసి, ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఓటర్ల జాబితాను స్తంభింపచేయడమంటే.. పేర్లు తొలగించిన, ఏ ఒక్క కొత్త వ్యక్తిని కూడా అసెంబ్లీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితాలో చేర్చేందుకు అనుమతించదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -