నవతెలంగాణ-తంగళ్ళపల్లి: జ్యోతిరావు పూలే ఎప్పటికీ ఆదర్శప్రాయుడు, చిరస్మరణీయుడు అని పలువురు కొనియాడారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండేపల్లి చౌరస్తా వద్ద, బిఆర్ఎస్ ఆధ్వర్యంలో, అలాగే బీసీ సంఘాల ఆధ్వర్యంలో జ్యోతిరావు వాపులే జయంతి సందర్భంగా శనివారం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ…గొప్ప సంఘసంస్కర్త, తొలి విప్లవకారుడు, సత్యశోధకుడు మహాత్మా జ్యోతిబాపూలే అని కొని ఆడారు. 18 వ శతాబ్దంలో కుల వివక్షకు, అంటరానితరానికి వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కుమార్, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గజభింకర్ రాజన్న, బీసీ సంఘాల కన్వీనర్ కందుకూరి రామ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగం గౌడ్,మాజీ ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్, వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు వల్లకొండ వేణుగోపాలరావు పాల్గొన్నారు.



