- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: 2 ఏండ్ల లోపు పిల్లలకు దగ్గు సిరప్లను ప్రిస్క్రిప్షన్లో రాయకుండా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే ఐదేళ్ల పిల్లలకు కూడా వీటి వాడకాన్ని తగ్గించాలని భావిస్తోంది. ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ విడుదల చేసిన నేషనల్ ఫార్ములరీ ఆఫ్ ఇండియా-2026 ముసాయిదాలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. గతేడాది దగ్గు మందుల వాడకం వల్ల పిల్లలు మరణించడం, వాటిలో హానికర రసాయనాలు ఉన్నట్లు తేలడంతో ఈ చర్యలు చేపట్టనున్నారు.
- Advertisement -



