- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : వచ్చే వారం దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులు నాలుగు రోజుల పాటు మూతపడనున్నాయి. ఏప్రిల్ 13 నుంచి ప్రారంభమయ్యే వారంలో అంబేడ్కర్ జయంతి, తమిళ నూతన సంవత్సరం, పోహెలా బోయిషాఖ్ పండుగల కారణంగా ఈ సెలవులు వస్తున్నాయి. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి, 15న పోహెలా బోయిషాఖ్, బోహగ్ బిహు, విషు సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. 16న ఇటానగర్, కొచ్చి, కోల్ కత్తా, తిరువనంతపురంలో బోహాగ్ బిహు సందర్భంగా బ్యాంకులు మూతపడనున్నాయి. 19న ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయనున్నారు.
- Advertisement -



