- Advertisement -
నవతెలంగాణ కుభీర్ : మండల కేంద్రమైన కుబీర్ లో ని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10గంటలకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి క్రాంతి కుమార్ మార్కెట్ కమిటీ చైర్మన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న మొక్కజొన్న రైతులు పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే ప్రభుత్వం 2400 మొదట కల్పిస్తుందని సూచించారు. దీంతో రైతులకు ముందుగా అధికారులు అందించిన టోకెన్ల ప్రకారం తీసుకోని పంటలను మార్కెట్ తీసుకువచ్చి సహకరించాలని తెలిపారు. అదే విదంగా రైతులు పట్టా పాస్ బుక్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ పత్రాలను తమ వెంట తీసుకురావాలని సూచించారు.
- Advertisement -



