- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో రాబోయే వారం రోజుల పాటు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 42°C నుంచి 45°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనుంది. మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 4 వరకు బయటకు వెళ్లవద్దని సూచించింది. బయటకు వెళ్లేప్పుడు టోపీ, గొడుగు వాడాలని, రైతులు, కూలీలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
- Advertisement -



