- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీస్ పంపారు. అంగన్వాడి మొబైల్ ఫోన్ల కొనుగోలు విషయంలో అవినీతి జరిగిందని తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లో పోస్టులు తొలగించి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని, లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని నోటీసులో పేర్కొన్నారు.
- Advertisement -



