- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : కేరళం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్.ఎస్. నుసూర్ సీపీఐ(ఎం)లో చేరారు. కాంగ్రెస్ పార్టీ మతతత్వ పక్షపాతానికి నిరసనగా ఆయన ఆ పార్టీని వీడి సీపీఐ(ఎం)తో కలిసి పనిచేయనున్నారు. ఈ మేరకు ఏకేజీ విజ్ఞాన కేంద్రంలో కేరళం రాష్ట్ర సీపీఐ(ఎం) కార్యదర్శి, ఎల్డీఎఫ్ కన్వీనర్ ఎం.వి. గోవిందన్ మాస్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. నుసూర్ను కండువా కప్పి గోవిందన్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు టి.పి. రామకృష్ణన్ ఉన్నారు.
- Advertisement -



