నవతెలంగాణ – మాస్కో : రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ దాడి కారణంగా రెండు కీలక విమానాశ్రయాలను మూసివేసినట్లు రష్యా అధికారులు తెలిపారు. భద్రత కోసం వ్నుకోవో మరియు డొమోడెడోవో విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలను నిలిపివేసినట్లు రష్యా పౌర విమానయాన సంస్థ రోసావియాట్సియా పేర్కొన్నారు. ఆదివారం తెల్లవారుజామున 4.00 గంటల సమయంలో మాస్కో వైపు దూసుకువస్తున్న తొమ్మిది ఉక్రేనియన్ డ్రోన్లను రష్యా వైమానిక రక్ష విభాగాలు ధ్వంసం చేయాని మేయర్ సెర్గీ సోబ్యానిన్ తెలిపారు.
ఉక్రెయిన్ డ్రోన్ దాడితో తులా ప్రాంతంలోని అజోట్ కెమికల్ ప్లాంట్లో స్వల్పకాలిక మంటలు చెలరేగాయని, ఇద్దరు సిబ్బంది గాయపడ్డారని అన్నారు. కలుగ ప్రాంతంలో ఏడు డ్రోన్లను కూల్చివేసినట్లు ప్రాంతీయ గవర్నర్ తెలిపారు. ఈ రెండు ప్రాంతాలు మాస్కోకు దక్షిణంగా, రాజధానికి సరిహద్దుగా ఉన్నాయి.
రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES