- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని స్తబ్దుగా ప్రారంభించాయి. సోమవారం ఆసియా మార్కెట్లు నష్టాలతో ట్రేడవుతుండటంతో ఆ ప్రభావం మన సూచీలపైనా కనిపించింది. దాంతో అవి స్వల్ప నష్టాలతో కదలాడుతున్నాయి.
ఉదయం 9.32 గంటల సమయంలో సెన్సెక్స్ 56 పాయింట్ల నష్టంతో 83,383 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 4 పాయింట్ల నష్టంతో 25,456 వద్ద కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.63 వద్ద ఉంది.
- Advertisement -