- Advertisement -
– క్యూబా రాయబార కార్యాలయ ప్రతినిధి రెండ్రోజుల పర్యటన
నవతెలంగాణ- న్యూఢిల్లీ బ్యూరో
తమిళనాడులో క్యూబా సంఘీభావ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు క్యూబా రిపబ్లిక్ రాయబార కార్యాలయం ఛార్జ్ డి వ్యవహారాల ప్రతినిధి అబెల్ అబల్లె డెస్పైగే రెండ్రోజుల తమిళనాడు పర్యటనలో భాగంగా శుక్రవారం సీపీఐ(ఎం) తమిళనాడు రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనతో సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు కె. బాలకష్ణన్, యు.వాసుకి, రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం, రాష్ట్ర నాయకులు, క్యూబా సాలిడారిటీ ఆర్గనైజేషన్ కార్యవర్గ సభ్యులు సమావేశమయ్యారు.
- Advertisement -