నవతెలంగాణ-హైదరాబాద్: శంషాబాద్ నుంచి గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్కు టమాటాల లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. టమాటాలు మొత్తం రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. లారీ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వే డైరీ ఫార్మ్ చౌరస్తా వద్ద ఈ ప్రమాదం జరిగింది. అయితే టమాటాల లోడ్తో వెళ్తున్న రైతులకు ఎవరికీ ఏ ప్రమాదం జరగకలేదు. కాగా, ఈ ఘటనతో రహదారిపై చాలాసేపటి వరకు ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు క్రేన్ సాయంతో లారీని పక్కకు తీశారు. అనంతరం రోడ్డుపై పడిన టమాటాలను తొలగించి ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చేశారు.

బండ్లగూడ, జూన్ 17: హైదరాబాద్ శంషాబాద్ సమీపంలో టమాటాల లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. శంషాబాద్ నుంచి గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్కు వెళ్తున్న సమయంలో లారీ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. లారీ బోల్తా కొట్టడంతో అందులో ఉన్న టమాటాలు మొత్తం రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.
పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వే డైరీ ఫార్మ్ చౌరస్తా వద్ద ఈ ప్రమాదం జరిగింది. అయితే టమాటాల లోడ్తో వెళ్తున్న రైతులు ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోవడం విశేషం. కాగా, ఈ ఘటనతో రహదారిపై చాలాసేపటి వరకు ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు క్రేన్ సాయంతో లారీని పక్కకు తీశారు. అనంతరం రోడ్డుపై పడిన టమాటాలను తొలగించి ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చేశారు.