- Advertisement -
నవతెలంగాణ- ఆర్మూర్
పట్టణంలోని సాయి టెక్నికల్ ఇనిస్ట్యూట్ యందు ఏసి, ఎలక్ట్రికల్ కోర్సు పూర్తి చేసుకున్న సందర్భంగా క్షేత్ర పర్యటనలో భాగంగా పెర్కిట్ కీర్తి ఐస్ ఫ్యాక్టరీని సందర్శించినట్టు డైరెక్టర్ జక్కుల రాజేందర్ యాదవ్ శనివారం తెలిపారు. అక్కడ ఏసీ గురించి, ఐస్ వాటర్ ఏవిధంగా తయారవుతుందని అంశాలపై అవగాహన కల్పించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ రమణయ్య, కంప్యూటర్ ఫ్యాకల్టీ ప్రసన్న, సంధ్యారాణి, నికిత ,కళ్యాణ్, విష్ణు విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -