- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి హత్య బెదిరింపు ఎదురైంది. ఇటీవలి కాలంలో ఆయనకు ఇలాంటి హెచ్చరిక రావడం ఇది ఆరోసారి కావడం గమనార్హం. శుక్రవారం ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి, తాను హైదరాబాద్లోనే ఉన్నానని, సాయంత్రంలోగా చంపేస్తానని తీవ్రంగా హెచ్చరించాడు. ఈ ఘటనతో అప్రమత్తమైన ఎంపీ, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు కాల్ వచ్చిన ఫోన్ నంబర్ను కూడా పోలీసులకు అందజేశారు. ఎంపీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.
- Advertisement -