- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యాడు. 1×bet కేసులో రైనా స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. మనీలాండరింగ్ చట్టం నిబంధనల ప్రకారం రైనా వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేయనున్నారు. రైనా నిబంధనలకు విరుద్ధంగా యాప్స్ ప్రమోషన్స్ చేసి రూ.కోట్లలో డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
- Advertisement -