- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. బీఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలలో ఐదుగురికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద వీరిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో.. 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గత నెల 31న ఆదేశించింది. మిగిలిన ఎమ్మెల్యేలకు కూడా విచారణ అనంతరం నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే వారం నుంచి వీరి విచారణ ప్రారంభం కానుంది.
- Advertisement -